![ఇంటి వద్దకే అంగన్వాడీ సరుకులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/mdk11-2.jpg?fit=677%2C339&ssl=1)
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఇంటివద్దకే వెళ్లి నేరుగా అంగన్వాడీ సరుకులను అందజేస్తామని అల్లాదుర్గం సీడీపీవో భార్గవి తెలిపారు. బుధవారం మెదక్జిల్లా పెద్దశంకరంపేటలోని పూసలగల్లీ, తిరుమలాపూర్ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు ఐదుగురు చిన్నారుల బరువు తూకం వేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. టీ షాట్ ద్వారా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు ప్లే ఆక్టివిటీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరళ, స్వరూప, అనురాధ ఉన్నారు.