![ఏపీ ప్రాజెక్టుతో అలంపూర్కు చుక్కనీరు రాదు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/sampath-1f.jpg?fit=650%2C364&ssl=1)
హైదరాబాద్: ఆర్డీఎస్ కుడికాల్వతో జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రాంతానికి చుక్క నీటిబొట్టు కూడా రాదని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆర్డీఎస్ కుడికాల్వ పనులను మొదలుపెట్టిన విషయమై ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను వివరించారు. ఏపీ చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడాలని సూచించారు. దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించాలని, పనులు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. కాల్వ పనులను అడ్డుకోకుంటే ఐక్యఉద్యమానికి ముందుకు రావాలని మంత్రులను కోరారు.