Breaking News

ఏపీ ప్రాజెక్టుతో అలంపూర్​కు చుక్కనీరు రాదు

ఏపీ ప్రాజెక్టుతో అలంపూర్​కు చుక్కనీరు రాదు

హైదరాబాద్​: ఆర్డీఎస్ ​కుడికాల్వతో జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ప్రాంతానికి చుక్క నీటిబొట్టు కూడా రాదని అలంపూర్​ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్ ​ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆర్డీఎస్ ​కుడికాల్వ పనులను మొదలుపెట్టిన విషయమై ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, వి.శ్రీనివాస్​గౌడ్​తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను వివరించారు. ఏపీ చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​ గవర్నమెంట్​తో మాట్లాడాలని సూచించారు. దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించాలని, పనులు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని సంపత్​ కుమార్​ డిమాండ్​ చేశారు. కాల్వ పనులను అడ్డుకోకుంటే ఐక్యఉద్యమానికి ముందుకు రావాలని మంత్రులను కోరారు.