Breaking News

ఐద్వా అధ్యక్షురాలిగా పీకే శ్రీమతి

సామాజికసారథి, హైదరాబాద్ డెస్క్: కొత్త కౌన్సిల్లో కోశాధికారిగా పుణ్యవతి తిరువనంతపురం: కేరళలో నిర్వహించిన ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) 13వ జాతీయ మహాసభ కొత్త కేంద్ర కమిటీ, ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నది. అఖిల భారత అధ్యక్షురాలిగా పీకే శ్రీమతి, ప్రధాన కార్యదర్శిగా మరియం ధావలే ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎస్.పుణ్యవతి ఎన్నికయ్యారు. 34 మంది సభ్యుల సెక్ర టేరియట్తో పాటు 103 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ ఎగ్జిక్యూ టివ్ కమిటీని ఎన్నుకున్నారు. ఐద్వా వైస్ ప్రెసిడెంట్ గా ఐద్వా అధ్యక్షు రాలు మాలినీ భట్టాచార్య పదవీ విరమణ పొందారు. ఆమెను బృందా కారత్, మరియం ధావలే అభినందించారు. మాలినీ భట్టాచార్య మాట్లాడుతూ వితకాలం ఐద్వా కార్యకర్తగా ఉన్నానని, ఈ క్లిష్ట సమయాల్లో సంస్థకు సహకారం అందిస్తూనే ఉంటానని అన్నారు.