Breaking News

మద్యం మత్తులో ఏడీఏ హల్ చల్

సామాజికసారథి, బిజినేపల్లి: అగ్రికల్చర్ ఏడీఏ రమేష్ బాబు మద్యం మత్తులో ఆదివారం రాత్రి బిజినేపల్లిలో జాతర నడిరోడ్డుపై హల్ చల్ సృష్టించాడు. జాతరలో కలిసిన నేతలకు మీ గ్రామాల్లో మీరు ఎవరి డైన సరే మీకు నచ్చిన 10 మంది పేరులు పంపు , నేను చూసుకుంటా …. అంటూ ఆర్ఏహెచ్ పథకంలో ‘ఎవరినైనా ఉంటే డబ్బులు కట్టించు నేను ఇప్పిస్తా’ అంటూ ఆఫర్ ఇచ్చారు. రూ.30వేల కట్టి రూ.50వేలు, 70వేలకు అమ్ముకో అని అవతలి వ్యక్తికి సూచించారు. ఈ రోజు లో కమిషను ల కు ఏవైనా పనులు జరుగుతాయి … మాకు కొంత ఇచ్చంకోండి , మీ పనులు చేసుకోండి … అంటూ ఆఫర్ చేస్తున్న ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.