![ఆధార్ లింక్ గడువు పెంపు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/MDK-COLLECTOR-11.jpg?fit=677%2C381&ssl=1)
సారథి న్యూస్, మెదక్: మొబైల్ కు ఆధార్ నంబర్ అనుసంధానం చేసేందుకు మీ- సేవా, ఈ-సేవా కేంద్రాలు మార్చి 31వ తేదీ వరకు రాత్రి 9గంటల వరకు పనిచేస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. కోవిడ్-19 వాక్సిన్ వేసుకునేందుకు పేరు నమోదుకు ఆధార్ ఆధారిత మొబైల్ ఓటీపీ ఆవశ్యకత ఉన్నందున ఈ వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు. మీ ఆధార్ కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయడం కోసం ఆధార్ కేంద్రాలతో పాటు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా మొత్తం 24 కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు. జిల్లాలో 24 కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు తెలుసుకునేందుకు http://www.medak.telangana.gov.in/service వెబ్ సైట్ ను సందర్శించాలని జిల్లా ప్రజలకు సూచించారు.