Breaking News

5+3+3+4

5+3+3+4
  • జాతీయ విద్యావిధానానికి కొత్త హంగులు
  • వృత్తి, ఉపాధి లభించేలా నూతన వ్యవస్థ
  • కేంద్రం మానవ వనరుల శాఖ.. ఇక విద్యామంత్రిత్వ శాఖగా మార్పు
  • ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ​కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యావిధానం ఉంటుందని తెలుస్తోంది. 5+3+3+4 విధానం అమల్లోకి రానున్నట్టు సమాచారం. 3 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించనుంది. కొత్త విద్యావిధానంలో సిలబస్ వంటి అంశాలు కూడా పూర్తిగా మారనున్నాయి. వృత్తి, ఉపాధి లభించే విధంగా విద్యా వ్యవస్థను మార్చనున్నట్టు తెలుస్తోంది. ఈ విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా పరిగణిస్తారు. ఆ తర్వాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్, గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూలు రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై కేంద్రప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వనుంది.