సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి వివరించారు. గురువారం మెదక్జిల్లా నర్సాపూర్అటవీ ప్రాంతంలో సీఎం కేసీఆర్మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, మెదక్జిల్లా కలెక్టర్ధర్మారెడ్డి కలిసి అటవీప్రాంతాన్ని పరిశీలించారు. నర్సాపూర్ అర్బన్పార్కులో సీఎం ఆరు మొక్కలు నాటుతారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 182 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. అవి నేడు పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు.
మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం మహాయజ్ఞాన్నివిజయవంతం చేయాలని కోరారు. వారి వెంట డీఎఫ్వో పద్మజారాణి, నర్సాపూర్ఎమ్మెల్యే మదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్చంద్రాగౌడ్, నర్సాపూర్మున్సిపల్చైర్మన్మురళీయాదవ్ తదితరులు ఉన్నారు.
సీఎం కార్యక్రమానికి ఎవరూ రావొద్దు
రాష్ట్ర ప్రభుత్వం గురువారం చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని కరోనా నేపథ్యంలో ప్రజలంతా వారి గ్రామాల్లోనే నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి హరీశ్రావుకోరారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తున్నారని, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎవరూ హాజరుకావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.