Breaking News

26న పీవీ సమాలోచన సభ

26న పీవీ సమాలోచన సభ

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 26న(బుధవారం) ‘సాహితీ సౌరభం.. అసమాన దార్శనికత’ పేరుతో తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సమాలోచన సభ జరగనుంది. పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ సభకు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ‌కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. రాజ్యసభ సభ్యుడు, ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, కవి అంపశయ్య నవీన్, రచయిత కల్లూరి భాస్కర్(‘ఇన్ సైడర్’ అనువాదకుడు) సదస్సుకు హాజరుకానున్నారు‌‌‌‌. దేశానికి, రాష్ట్రానికి పీవీ అందించిన సేవలు, సంస్కరణలు, ఇతర అంశాలను ఈ సభలో చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.