Breaking News

హైదరాబాద్​కు చేరిన కల్నల్​ కుటుంబసభ్యులు

శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో కల్నల్​ సంతోష్​బాబు కుటుంబసభ్యులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమరజవాన్​ కల్నల్​ సంతోష్ బాబు సతీమణి, పిల్లలు బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్​పోర్టు​కు చేరుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ వారిని రిసీవ్​ చేసుకున్నారు. అమరజవాన్ కుటుంబసభ్యులతో సీపీ, ఇతర పోలీస్​ అధికారులు చాలా సేపు వారితో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. వారిని ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తీసుకెళ్లనున్నారు. మంగళవారం చైనా బలగాల దొంగ దెబ్బకు కల్నల్​ సంతోష్​బాబు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యావత్​ దేశమంతా దిగ్ర్భాంతికి గురైంది.