Breaking News

హెచ్​బీటీలను ఆదుకోండి

సారథి న్యూస్, రామడుగు: కరోనాతో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి లేనందున తమను ఆదుకోవాలని హెచ్​బీటీ ( అవర్లీ బేస్డ్​ టీచర్స్​) కోరారు. మంగళవారం వారు చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలీ చాలని జీతాలతో బతుకు వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్​బీటీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సత్యానందం, రమేశ్​, రమణ, జ్యోతి , అరుణ, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.