Breaking News

స్పీడు పెంచిన రానా

స్పీడు పెంచిన రానా

‘అరణ్య’ చిత్ర రిలీజ్​కోసం ఈగర్​ గా వెయిట్​చేస్తున్న రానా రీసెంట్​గా ఓ తమిళ మూవీలో నటించనున్నాడన్న టాక్​వినిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజస్​లో ప్యాన్​ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘అరణ్య’ రిలీజ్​లాక్​డౌన్​కారణంగా నిలిచిపోయింది. రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ షూటింగ్​తో బిజీగా ఉన్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలైట్​బ్యాక్​డ్రాప్​లో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా నక్సలైట్​గా కనిపించనున్నాడు. డాక్టర్​రవిశంకర్​కామ్రేడ్​రవన్నగా ఎలా మారాడు అన్నది స్టోరీ.

డిసెంబర్​ 14న రానా బర్త్​ డే సందర్భంగా టీమ్​ఈ మూవీ గ్లింప్స్​ను రిలీజ్ ​చేసి సినిమాపై ఆసక్తి కలిగించింది టీమ్. దీని తర్వాత రానా ‘అయ్యప్పనుమ్​కోషియమ్​’ మలయాళ రీమేక్ లో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత రానా గుణశేఖర్​ చిత్రం ‘హిరణ్యకశ్యప’ లో నటించాల్సి ఉంది. బాబాయ్​వెంకటేష్​మూవీ కూడా చేస్తాడన్న టాక్ కూడా నడుస్తోంది. ఇంతలో ఈ వార్త వచ్చింది. సిద్దార్థ హీరోగా వచ్చిన ‘గృహం’ ఫేమ్​మిలింద రాయ్​రానాకు సూపర్ నేచురల్​ థ్రిల్లర్​స్టోరీ ఒకటి వినిపించాడని.. ‘ధీరుడు’ అనే టైటిల్​తో ఈ చిత్రాన్ని రూపొందిస్తారని.. లైన్​నచ్చడంతో వెంటనే ఓకే అనేశాడని అంటున్నారు. ప్యాన్​ ఇండియా మూవీగా సురేష్​ ప్రొడక్షన్ ​బ్యానర్​లో గోపీచంద్​ఆచంట నిర్మించేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయట. ప్రస్తుతం మిలింద్​లేడీ సూపర్​స్టార్​నయనతారతో ‘నేట్రికన్’ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆ మూవీ ఫినిష్​అయ్యాక ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ​అనౌన్స్​మెంట్​ వస్తుండొచ్చేమో.. లేదా ఈ లోపే రానా ఏదైనా అప్​డేట్​ఇవ్వొచ్చేమో వేచిచూద్దాం..!