Breaking News

సౌలత్ మంచిగుంది సారూ..

సౌలత్ మంచిగుంది సారూ..

– మంత్రి హరీశ్ రావుతో ఓ రైతు

సారథి న్యూస్​, సిద్దిపేట: కరోనా నేపథ్యంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రైతు మార్కెట్లలో సామాజిక దూరం పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులు, కొనుగోలుదారులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూలులో ఏర్పాటుచేసిన తాత్కాలిక రైతు బజార్​ ను మంగళవారం ఉదయం మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. రైతులు, కూరగాయల విక్రయదారులతో మాట్లాడారు. ‘తాత్కాలిక మార్కెట్లలో అనుకున్న విధంగా మీకు వెసులుబాటు ఉందా..?’ అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ‘సౌలత్ లు బాగున్నయ్​ సారూ’ అంటూ ఓ రైతు బదులిచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.