Breaking News

సేంద్రియసాగుతో ఆరోగ్యసిరులు

సారథిన్యూస్, రామాయంపేట: రైతులు సేంద్రియ పద్ధతులతో సాగుచేసి పర్యావరణాన్ని సంరక్షించాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్​ సూచించారు. సోమవారం మెదక్​ జిల్లా నిజాంపేటలోని సబ్​ మార్కెట్​ యార్డులో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆద్వర్యంలో దళిత రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సతీశ్​ మాట్లాడుతూ.. యువతకు, పిల్లలకు వ్యవసాయంపై అవగహన పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పీ శంకర్, డీబీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్​ దుబాషి సంజీవ్, ఏఈవో గణేశ్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.