![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/AGRIIIIIIIIFF.jpg?fit=729%2C293&ssl=1)
సారథిన్యూస్, రామాయంపేట: రైతులు సేంద్రియ పద్ధతులతో సాగుచేసి పర్యావరణాన్ని సంరక్షించాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్ సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆద్వర్యంలో దళిత రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సతీశ్ మాట్లాడుతూ.. యువతకు, పిల్లలకు వ్యవసాయంపై అవగహన పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పీ శంకర్, డీబీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దుబాషి సంజీవ్, ఏఈవో గణేశ్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.