Breaking News

సూర్యాపేటలో నర్సుకు కరోనా

సూర్యాపేటలో కరోనా

సారథిన్యూస్​ సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాల్లోనూ అనూహ్యంగా కేసులు పెరుగుతున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లో విధులు నిర్వర్తిస్తున్న ఓ నర్సుకు, ఆమె కుటుంబసభ్యులకు కరోనా సోకింది. దీంతో వారిని ఐసోలేషన్​కు తరలించారు. మరోవైపు జిల్లా దవాఖానలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది తమకు కరోనా పరీక్షలు చేయండంటూ హాస్పిటల్​ సూపరింటెండెంట్​కు విన్నవించుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా తమకు కరోనా పరీక్షలు చేయడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు.