Breaking News

సురేందర్​రెడ్డి కొత్త ప్రయోగం

ప్రముఖ దర్శకుడు సురేందర్​రెడ్డి ఓ వెబ్​సిరీస్​కు దర్శకత్వం వహించబోతున్నాడంటూ సినీవర్గాల్లో జోరుగా టాక్​నడుస్తున్నది. తెలుగులో ఇప్పటివరకు ఏ దర్శకుడు టచ్​చేయని ఓ ప్రయోగాత్మక కథకు సిరీస్​కు ఆయన దర్శకత్వం వహించబోతున్నారట. ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్​ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ ఆహాలో దీన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. సురేందర్​రెడ్డి తెలుగులో సైరా నరసింహారెడ్డి, కిక్​ సహా ఎన్నో హిట్​ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సైరా తరువాత మరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వరుణ్​తేజ్​తో ఓ సినిమాను తెరకెక్కిస్తాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి.