Breaking News

సీఎం ఫామ్ హౌస్​లో ఉంటే కరోనా తగ్గుతుందా?

సీఎం ఫామ్ హౌస్​లో ఉంటే కరోనా తగ్గుతుందా?

సారథి న్యూస్, హైద‌రాబాద్: కరోనాతో చాద‌ర్‌ఘాట్‌లోని తుంబే హాస్పిటల్‌లో చేరిన ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాకు కేవ‌లం 24గంటలకు రూ.1.15లక్షల బిల్లు వేయ‌డంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైద్యురాలికే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే ఇక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే సాధారణ జ‌నం పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి సెల్ఫీ వీడియోను రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక్క రోజుకు ఆస్పత్రి యాజమాన్యం రూ.లక్ష బిల్ చేసిందని, ప్రశ్నించిన సుల్తానాను ఆస్పత్రిలో బంధించారని ధ్వజమెత్తారు. సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను చెప్పిందని, సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ లో‌ క్వారంటైన్ లో ఉంటే తెలంగాణలో కరోనా తగ్గుతుందా? అని ప్రశ్నించారు.

బాధితురాలి సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాతో పాటు మీడియాలో రావడంపై వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్పందించి తుంబే ఆస్పత్రిలో ఉన్న కోవిడ్ బాధితులను నిమ్స్ కు తరలించాలని అధికారులను సూచించారు. మ‌రోవైపు ఆస్పత్రి వర్గాలు మీడియా సమావేశం నిర్వహించి తమ వద్ద బెడ్ సదుపాయం లేకున్నా ఆమె కోరిక మేరకే డీలక్స్ రూమ్ ఇచ్చామన్నారు. రేట్ ఎక్కువైనా ఫర్వాలేదని, ఆమె చెబితేనే ఇచ్చామన్నారు. ఆ త‌ర్వాత బిల్ చెల్లించ‌లేక ఆస్పత్రి సిబ్బందిని ఆమెను నిర్బంధించిందని అన్నారు. త‌న‌ను కాపాడాలని తెలిసిన‌వారికి పంపించారని చెప్పారు. ఆ త‌ర్వాత వారి సాయంతో చాద‌ర్‌ఘాట్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారన్నారు.