![సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/CPD-33.jpg?fit=705%2C317&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్రావుపేట గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కె.చంద్రశేఖర్రావును ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. దీంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రజబ్ అలీ, గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి బాబు, పూడూరి మల్లేశం, ఎడవెల్లి పాపిరెడ్డి, అంజయ్య, రాజిరెడ్డి, మల్లేశం, కమలాకర్, శ్యాంసుందర్ రెడ్డి, రమేష్, ఆనందం రెడ్డి, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.