Breaking News

సిజేరియన్లు తగ్గించాలి

సిజేరియన్ డెలివరీలు తగ్గించాలి

సారథి న్యూస్​, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఎంఎచ్ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్ ​సుజాత బుధవారం సందర్శించారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణిగా నమోదు నుంచి ప్రసవమయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహిళలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలని, సాధారణ కాన్పులు అయ్యేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని కోరారు. సూచించారు. గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు కేసీఆర్​ కిట్ లో ఆన్​లైన్ ​చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్ వో డాక్టర్​సుధాకర్ లాల్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ హెల్త్ రిజిస్ట్రేషన్​ను త్వరగా పూర్తిచేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సూచించారు. వారి వెంట డీఐవో డాక్టర్​సాయినాథ్ రెడ్డి, డాక్టర్​ శ్రీకాంత్, డాక్టర్​శ్రవణ్ వైద్యసిబ్బంది ఉన్నారు.