Breaking News

సావిత్రి ఫాలోవర్స్​ లక్షమంది

సావిత్రి ఫాలోవర్స్​లక్షమంది

తీన్మార్ సావిత్రి అలియాస్​ శివజ్యోతి అరుదైన రికార్డు సాధించింది. తెలంగాణ భాష, యాసలో వార్తలు అందించే ఆమె ‘జ్యోతక్క’ పేరుతో ఆగస్టు 1వ తేదీన స్టార్ట్​ చేసిన యూ ట్యూబ్​ చానెల్​కు అతితక్కువ కాలంలోనే లక్ష మంది ఫాలోవర్స్​ను సంపాదించుకుంది. ఆమె పోస్ట్ ​చేసిన వీడియోస్​ను సుమారు 7.67లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె సబ్​స్ర్కైబర్స్​కు థ్యాంక్స్​ చెప్పింది. టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు న్యూస్ చానెల్ ​వీ6 తీన్మార్ వార్తల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. బిత్తిరి సత్తితో కలిసి అచ్చమైన తెలంగాణ, గ్రామీణ భాషలో న్యూస్​ అందించేది. బిగ్​బాస్ ​షోలోనూ సందడి చేసింది. శివజ్యోతి నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన యశోద, రాజమల్లేష్ దంపతుల కూతురు. తల్లి బీడీ కార్మికురాలు కాగా, తండ్రి ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె టీవీ 9 ఛానల్ లో ఇస్మార్ట్ న్యూస్ వ్యాఖ్యాతగా పనిచేస్తోంది.