Breaking News

సార్​కు జోహార్​

సారథిన్యూస్, చొప్పదండి / ఖమ్మం: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్​ జయశంకర్​ సేవలు మరువలేనివని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. ప్రొఫెసర్​ జయశంకర్​ వర్ధంతి సందర్భంగా కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని క్యాంప్​ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జయశంకర్​ సార్​ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో జెడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ కొండబాల కోటేశ్వరరావు తదితరులు ప్రొఫెసర్​ జయశంకర్​ చిత్రపటానికి నివాళి అర్పించారు.