![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/SONIA-GANDHI-NEWWW.jpg?fit=700%2C427&ssl=1)
ఢిల్లీ: ఏఐసీసీ ( ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ) కొత్త అధ్యక్షులు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సీడబ్ల్యూసీ ( కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని సమచారం. అయితే సమావేశంలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షురాలిగా తాను కొనసాగలేనని సోనియాగాంధీ తేల్చిచెప్పనట్టు సమాచారం. ఈ భేటీపై కాంగ్రెస్ శ్రేణులే కాదు.. యావత్ భారతదేశం ఆసక్తిని కనబరుస్తున్నది. అందుకు కారణం ఈ భేటీ అనంతరం కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడు ఎన్నికవుతాడని విస్తృత ప్రచారం జరగడమే. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారాల జరిగిన సమావేశంలో మొత్తం 48 మంది పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాగా గాంధీ కుటుంబీకులే తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మెజార్జీ నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టడానికి అయిష్టత చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.