Breaking News

సర్పంచ్​ల సంఘం ఉపాధ్యక్షురాలిగా శైలజ

సారథి న్యూస్, చేవెళ్ల : సర్పంచుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజ నియమితులయ్యారు. బుధవారం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కటి వెంకటేశ్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్​ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్​లు పాల్గొన్నారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందని శైలజ పేర్కొన్నారు.