![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/YERRABELLI-DAYAKARF.jpg?fit=290%2C174&ssl=1)
సారథిన్యూస్, వరంగల్ అర్బన్: వరంగల్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు వరంగల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతీ, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రాజం, బల్దియా ఇంచార్జి ఎస్ఈ విద్యాసాగర్, వరంగల్ ఆర్డీవో వాసుచంద్ర , కాజీపేట హన్మకొండ తహసీల్దార్లు నాగేశ్వర్ రావు, కిరణ్ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.