Breaking News

శేష్ తర్వాత శర్వానే..

‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు అడవి శేష్. గూఢచారి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యానర్ జీఎంబీలో తన తర్వాత సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్​లో ‘మేజర్’ సినిమా ప్రారంభమైంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే మేజర్ సినిమా చిత్రీకరణ ఎంతవరకూ పూర్తయింది అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమా ఇంకా సెట్స్​పై ఉండగానే మహేష్ బాబు, శర్వానంద్ హీరోగా మరో సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్ బ్యానర్​పై నిర్మించాలని అనుకుంటున్నారట. అనుకున్నట్టే జరిగితే మరో రెండు మూడు వారాల వ్యవధిలో అధికారిక ప్రకటన వెలువరిస్తారట.

ప్రస్తుతం జీఎంబీ టీమ్ శర్వానంద్ కోసం స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. కథ ఏమిటని ఇంకా రివీల్ కాలేదు. శర్వానంద్ ​ఫ్లాపులతో ముందుకెళ్తున్నా సినిమా చాన్సులకు ఏమీ కొదవలేదు. ప్రస్తుతం ‘శ్రీకారం’ చిత్రం, డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘మహాసముద్రం’ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. నెక్ట్స్ మహేష్ బాబు సినిమాలో ఖాయం అనిపించుకున్నాడు.