Breaking News

వైద్యపరీక్షల సామర్థ్యం పెంపు

సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్​)లో కొంత భాగాన్ని కోవిడ్ –19 ఆస్పత్రిగా సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఐదొందల పడకల సామర్థ్యంతో కోవిడ్​ విభాగాన్ని పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు. రోజుకు రెండువేల వైద్యపరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందన్నారు.

పరీక్షలకు ముందుకు వచ్చే వారికి టోకెన్ జారీచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో డాక్టర్​ ఎం.చెంచయ్య, ప్రజారోగ్యశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర్​రావు, ఏపీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ప్రసాద్, జేసీ సుమిత్ కుమార్, జీజీహెచ్ పర్యవేక్షకుడు డాక్టర్​ ఏ.కృష్ణమూర్తి, ఆర్ఎంవో డాక్టర్​ హేమంత్ పాల్గొన్నారు.