Breaking News

వైఎస్సార్ ​ఆశయ సాధనకు కృషి

వైఎస్సార్​ఆశయసాధనకు కృషి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్​వైఎస్​ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని కాంగ్రెస్​నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్​చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్​హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం 104, 108సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్​అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాకు తాగు, సాగునీటిని అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్​కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషిచేస్తుందన్నారు.

‘రాజన్న ఆశయాలు సాధిద్దాం.. రాహుల్​గాంధీని ప్రధానమంత్రి చేద్దాం’ అని పిలుపునిచ్చారు. రాహుల్​గాంధీని ప్రధానమంత్రి చేయాలని మహానేత వైఎస్సార్​ కలలుగన్నారని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భరత్ కుమార్ ఆచారి, కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ బత్తుల చిన్నయ్య, జిల్లా మైనార్టీ నాయకులు పఠాన్ హబీబ్ ఖాన్, బీసీసెల్​ నాయకులు బోయ నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు విజయ్ యాదవ్, అఖిల్, రాంబాబు, కాసీం, నాని కృష్ణారెడ్డి అయ్యన్న వెంకట్ నాయుడు, కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు సంధ్య, వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.