![వాళ్లిద్దరూ కలిస్తే](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/ntr-2.jpg?fit=600%2C400&ssl=1)
రెండు వారాలుగా టాలీవుడ్లో ఎక్కడ విన్నా ఈ వార్తే వినిపిస్తోంది. ఏమిటంటారా? మహేష్బాబు, ఎన్టీఆర్ కలిసి నటిస్తారని. ఒక్కోసారి అది నిజం కావొచ్చని కూడా అంటున్నారు ఫిల్మ్నగర్ సర్కిల్స్లో.. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోలంతా తమ వే మార్చుకుని మల్టీస్టారర్గా నటించేందుకు ముందుకొస్తున్నారు కాబట్టి. మహేష్, ఎన్టీఆర్ తో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్, రామ్చరణ్ కలయికతో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కారణంగానే అల్లు అరవింద్కు ఈ ఆలోచన వచ్చిందట. పైగా, ఆయన చాలాకాలంగా మహేష్బాబుతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చడం లేదు. ఎన్టీఆర్, మహేష్లకు మంచి సాన్నిహిత్యం ఉన్నందున ఈ ఇద్దరినీ కలిపి ఓ భారీ మల్టీ స్టారర్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా హీరోలు ఇద్దరితోనూ అల్లు ఫోన్లో సంప్రదించారని, ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఏడాదే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తుంగా.. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది.