Breaking News

వారి సేవలు మరువలేనివి

వారి సేవలు మరువలేనివి

సారథి న్యూస్, నాగర్​ కర్నూల్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో వైద్యులు, పోలీసులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం మే డే సందర్భంగా తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో వారితో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు వారి మిత్రబృందం మున్సిపల్ కార్మికులకు అన్నదానం నిర్వహించడంతో అభినందించారు.

కరోనా కట్టడికి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషిచేస్తుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కొత్త వస్త్రాలు అందజేసి సన్మానించనున్నట్లు ప్రకటించారు.  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పన, కమిషనర్ అన్వేష్, వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.