![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/MULUGU-2-F.jpg?fit=600%2C241&ssl=1)
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వాజేడ్ మండలంలో ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాజేడ్, వెంకటాపురం మండలాల్లో 16 మందితో సన్నిహితంగా ఉన్నాడని తెలుసుకుని వారితో పాటు వారి కుటుంబసభ్యులను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.