![](https://samajikasarathi.com/wp-content/themes/magazine-newspaper-pro/images/no-image.jpg)
ఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజూ దేశంలో 60 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 61,537 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,88,612కి చేరింది. అలాగే, రికార్డు స్థాయిలో ఒక్కరోజే 933మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 42,518కి పెరిగింది. దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 2.05గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు, కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14లక్షలు దాటేసింది. ప్రస్తుతం రికవరీ అయిన వారి సంఖ్య 14,27,006గా ఉంది. దేశంలో ప్రస్తుతం 6,19,088 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్లో రికవరీ రేటు 68శాతంగా ఉంది.