Breaking News

వరవరరావుకు కరోనా పాజిటివ్​

వరవరరావుకు కరోనా పాజిటివ్​

సారథిన్యూస్​, హైదరాబాద్: ​ విప్లవరచయిత, విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని సెయింట్​ జార్జ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే కేసులో వరవరరావును ముంబై పోలీసులు 2018లో అరెస్ట్​ చేశారు. అనంతరం ఈ కేసును ఎన్​ఐఏకు (నేషనల్​ ఇన్విస్టిగేషన్​ ఏజెన్సీ) అప్పగించారు. ముంబైలోని తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో జేజే ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. ఆయనకు పాజిటివ్​ వచ్చింది. కొంతకాలంగా ఆయనను విడుదల చేయాలని రాష్ట్రంలోని ప్రజాస్వామిక వాదులంతా డిమాండ్​ చేస్తున్నారు.