Breaking News

లాక్‌డౌన్‌ పాటించండి.. స్వర్గం ఏమి ఊడిపడదు

లాక్‌డౌన్‌ పాటించండి.. స్వర్గం ఏమి ఊడిపడదు


బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 33 గంటల పాటు లాక్‌డౌన్‌ విధించారు. శనివారం నుంచి సోమవారం సాయంత్ర 5గంటల వరకు లాక్‌డౌన్‌ విధించినట్లు పోలీసులు చెప్పారు. బెంగళూరులో ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌ ప్రారంభం కాగా.. ఈ సారి శనివారం నుంచి సోమవారం వరకు విధించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్‌‌ ప్రజలను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘లాక్‌డౌన్‌ 8గంటలకు స్టార్ట్‌ అవుతుంది. సోమవారం సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. రెస్పెక్టెడ్‌ సిటిజన్స్‌ ఇంట్లోనే ఉండండి. సడలింపుల గురించి ఆలోచించొద్దు. ఇది ప్రతి ఒకరి ఇంట్రెస్ట్‌తో జరుగుతోంది. మీ పనులు ఒకరోజు పనులు వాయిదా వేస్తే స్వర్గం ఏమి పడదు’ అని బెంగళూరు ఐపీఎస్‌ ఆఫీసర్‌‌ భాస్కర్‌‌ రావు ట్వీట్‌ చేశారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన పోలీసులు సోమవారం సాయంత్రం ఎత్తేయనున్నారు. సోమవారం నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. గవర్నమెంట్‌ ఆఫీసులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. కర్ణాటకలో ఒకరోజే 1,839 కరోనా కేసులు నమోదయ్యాయి.