Breaking News

రైతుల మేలు కోసమే ఉచిత విద్యుత్​

రైతుల మేలు కోసమే ఉచిత విద్యుత్​

సారథి న్యూస్, కర్నూలు: రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం సమావేశ భవనంలో వైఎస్సార్​ ఉచిత విద్యుత్‌ పథకంపై డివిజన్‌ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల సబ్​ కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్​ను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్​ ఉచిత విద్యుత్​ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను చైతన్యపర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ ఉద్యోగులపై ఉందన్నారు. గ్రామసభలు ఏర్పాటుచేసి రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు అడిగిన వెంటనే కరెంట్​ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. కందికాయపల్లెలో రైతు కనెక్షన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు ఇవ్వలేదన్నారు. సమావేశంలో విద్యుత్‌ ఈఈ నాగరాజు, వ్యవసాయశాఖ ఎఫ్‌టీసీ, ఏడీఏ విల్సన్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.