Breaking News

రైజింగ్ సన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్

సారథిన్యూస్, రామడుగు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని యువజన సంఘం సభ్యులు చెప్పారు. ఆదివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట శివారులో రైజింగ్​ సన్​ యువజనసంఘం సభ్యులు స్వచ్ఛ భారత్​ నిర్వహించారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తా, చెదారం తొలిగించారు. కార్యక్రమంలో రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు గజ్జెల అశోక్, ప్రధాన కార్యదర్శి జేరిపోతుల మహేశ్​, గజ్జెల నవీన్, ప్రశాంత్, రాజు కుమార్ పాల్గొన్నారు.