Breaking News

రేషన్​ బియ్యం తరలిస్తూ చిక్కారు

రేషన్​ బియ్యం పక్కదారి

సారథి న్యూస్​, ఖమ్మం: రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద 25 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్​ చేశారు. ఖమ్మంలోని పార్శిబందం ప్రాంతానికి చెందిన సీహెచ్​ కృష్ణ, రాము అనే వ్యక్తులు రేషన్​ బియ్యాన్ని రెండు ఆటోల్లో తరలిస్తుండగా.. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఖమ్మం అర్బన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని శ్రీరాములు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 18 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు సీజ్​ చేశారు.