Breaking News

రెచ్చగొట్టే చర్యలకు బదులిస్తాం

ఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే బదిలిచ్చే సత్తా భారత్​కు ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వాఖ్యానించారు. లడ్డాఖ్​లోని గాల్వన్​లోయలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కరోనాపై ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షలో ప్రధాని మాట్లాడారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని.. చైనా చర్యలకు తగినసమయంలో తగిన రీతిలో బదులిస్తామని స్పష్టం చేశారు. భారత్​-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్​ 19న సాయంత్రం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది.