Breaking News

రుణపరిమితి పెంచండి

రుణపరిమితి పెంచండి

సారథి న్యూస్, ఖమ్మం: డీసీసీబీ సహకార రుణాలను పెంచి.. సొసైటీలకు ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్​కూరాకుల నాగభూషయ్యను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. బుధవారం ఖమ్మం డీసీసీబీ ఆఫీసులో చైర్మన్​ను కలిసి రుణాల విషయమై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 99 సొసైటీలకు రూ.50కోట్లు మంజూరు చేశారని, రుణాలు పొందని రైతులు ఎక్కువగా ఉండడంతో ఆ మొత్తం సరిపోవడం లేదని, సొసైటీలకు రుణాలు మంజూరు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. కొన్ని మండలాల్లో 4 నుంచి 5 సొసైటీలు ఉన్నాయని, అందరికీ ఒకేలా రుణాలు మంజూరు చేస్తే ఒకే ఒక్క సొసైటీ ఉన్న మండలంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఆయన వెంట ఖమ్మం డీసీసీబీ సీఈవో వేణుగోపాల్, పాల్వంచ సొసైటీ సీఈవో లక్ష్మీనారాయణ ఉన్నారు.