Breaking News

రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో శనివారం నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన బొమ్మన భిక్షపతి రూ.25వేలు, వడ్ల శ్రీనివాసులు రూ.44,వేలు, భూడాల దుర్గయ్య కు రూ.48వేల చొప్పున విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్, ఆకుల లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు సిద్ధారెడ్డి, ఆకుల మహిపాల్, వెంకయ్య పాల్గొన్నారు.