Breaking News

మోహన్ బాబు మల్టీస్టారర్ ప్లాన్


ప్రజంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలకు.. మల్టీ స్టారర్ చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంతకు ముందు లేని విధంగా భారీ సినిమాలు భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్​లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టీస్టారర్ ‘రౌద్రం రుధిరం రణం’.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 20వ పాన్ ఇండియన్ మూవీ.. ఇంకా అల్లు అర్జున్ ‘పుష్ప’ ఇలా అన్నీ పెద్ద సినిమా రేంజ్​ల సిద్ధమవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కూడా ఓ భారీ మల్టీస్టారర్ ను రూపొందించనున్నారట. మంచు ఫ్యామిలీ చాలారోజులుగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. అప్పుడప్పుడు మోహన్ బాబు ప్రత్యేక పాత్రల్లో కొనసాగుతున్నా.. విష్ణు, మనోజ్​ సోలోగా విజయాలు మాత్రం అందుకోలేదు.

గాయత్రి సినిమాతో సక్సెస్ అందుకోవాలని మోహన్ బాబు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ సినిమాపై పెట్టిన బడ్జెట్ కూడా రాలేదు. అయితే వీరు ముగ్గురు కూడా ఓ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు తన కొడుకులతోనే మల్టీస్టారర్ సినిమాను సొంత బ్యానర్​లో తీయాలని అనుకున్నాడట. ఇదివరకు మంచు హీరోలు ముగ్గురూ కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. ఆ తర్వాత వాళ్లు కలిసి మళ్లీ నటించలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని ఈ ఫ్యామిలీ నిశ్చయించుకున్నారట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని మోహన్ బాబు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈసారి కలిసికట్టుగా నైనా హిట్ సాధిస్తారేమో చూద్దాం.