![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/indrakaran-reddy.jpg?fit=713%2C493&ssl=1)
సారథిన్యూస్, మంచిర్యాల/ సిద్దిపేట/చిన్నకోడూర్ : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్మ్డ్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఆయన మొక్కలు నాటారు. మరోవైపు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని హరీశ్రావు కాలనీలో సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు అధ్వర్యంలో మొక్కలు నాటారు. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సాయికుమార్, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళీకెరీ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ డీసీపీ ఏఆర్ సంజవ్, బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, ఏఆర్ ఏసీపీ నాగయ్య, బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐలు, ఏఆర్ ఆర్ఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.