![మెురుమూరులో వైద్యశిబిరం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/medical-camp-2f-1.jpg?fit=1009%2C424&ssl=1)
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా వాజేడు మండలంలోని మెురుమూరు పంచాయతీ గణపురం గ్రామంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారు, గర్భిణులు, బాలింతలు, క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యచికిత్సలు చేశారు. కరోనా సమయంలో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, ఏఎన్ ఎం ఛాయాదేవి, అంగన్వాడీ టీచర్, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.