Breaking News

మిల్లులకు ధాన్యం తరలించాలి

మిల్లులకు ధాన్యం తరలించాలి

రైస్​ మిల్లులకు ధాన్యం తరలించాలి

సారథి న్యూస్, మెదక్: ధాన్యం కొనుగోలు, నాణ్యత పరిశీలన, రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియపై కలెక్టరేట్ లో మెదక్​ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. అకాలవర్షాలకు రైతులు ధాన్యం నష్టపోకుండా వెంటనే రైస్​ మిల్లులకు తరలించాలని సూచించారు. హమాలీలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు ఆన్​ లైన్​లో అప్​ లోడ్​ చేయాలన్నారు. మిల్లుల్లో ఖాళీ అయిన గోనె సంచులను వెంటనే గోదాంలకు తిరిగి ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ  రమ్య, జిల్లా రైస్ మిల్లర్స్​ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రపాల్, ఇఫ్కో డైరెక్టర్, కొనాపూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, అన్ని బాయిల్డ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.