Breaking News

మాస్టర్ ‘యోగా’

ముంబై: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యోగాసానాలు వేశాడు. కూతురు సారా, కుమారుడు అర్జున్ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ‘పిల్లలతో కలిసి యోగా చేయడం వల్ల ఫాదర్స్ డేను కూడా జరుపుకుంటున్నాం’ అని సచిన్ ట్వీట్ చేశాడు. అంతకుముందు తన నాన్నతో ఉన్న ఫొటోను కూడా మాస్టర్ అభిమానులతో పంచుకున్నాడు. ‘అన్నింటికంటే ముందు మంచి వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నించు. అని మీరు చెప్పిన విలువైన మాటలను ఎప్పటికీ గుర్తుంచుకుంటా’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ స్టార్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా యోగాసానాలు వేశాడు. టీమిండియా క్రికెటర్లతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైంది.