Breaking News

మార్కెటింగ్​ సమస్యను అధిగమిద్దాం

సారథి న్యూస్, రామడుగు: రైతన్నలు మార్కెటింగ్​ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రామడుగు వ్యవసాయాధికారి యాస్మిన్​ పేర్కొన్నారు. తాము పండించిన ఉత్పత్తులను తామే విక్రయించుకొనే స్థాయికి ఎదగాలని సూచించారు. రైతులంతా సమష్టిగా ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. బుధవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్​లో ఉత్పత్తిదారుల సంఘంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యాస్మిన్​ మాట్లాడారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే సమిష్టిగా లాభాలు పొందవచ్చని ఆమె సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, ఎంపీటీసీ మోడీ రవి, ఏఈవో కట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.