Breaking News

మాకు ప్రశ్నించే అధికారం లేదా?

మాకు ప్రశ్నించే హక్కు లేదా?

సారథి న్యూస్, వాజేడు: ‘నాకు ప్రశ్నించే అధికారం లేదా..? నేను ఓ ప్రజాప్రతినిధిని కాదా?, కనీసం నాకు విలువ లేదా?’ అని కన్నీరుమున్నీరయ్యారు ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శ్యామల శారద. మంగళవారం ఆమె జడ్పీటీసీ సభ్యురాలు తల్లడి పుష్పలతతో కలిసి స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీడీవో చంద్రశేఖర్ పై విమర్శలు గుప్పించారు. పల్లెల్లో జరిగే పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తే తమను చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ‘పనులపై ఆరా తీసే పని నీకేంటి.. నీకు అధికారం ఎవరిచ్చారు..? నీ వయసెంత’ అని చులకనచేసి మాట్లాడారని మండిపడ్డారు. ఈ విషయాలపై తమ సొంత పార్టీ టీఆర్ఎస్​నాయకులకు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.