Breaking News

మహిళా అభ్యున్నతే మా ధ్యేయం

మహిళా అభ్యున్నతే మా ధ్యేయం

సారథి న్యూస్, కర్నూలు: మహిళా అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఎస్ హసీనాబేగం అన్నారు. శనివారం ఆ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళా హక్కుల సాధనకు పోరాడుతూ వారిని చైతన్యపరిచే దిశగా తమ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టంచేశారు. మహిళలు అన్నిరంగాల్లో వెనకబడి ఉన్నారని అన్నారు. మహిళలు చైతన్యవంతమై ఓ శక్తిలా ఎదిగినప్పుడే సమాజం సమగ్ర సమైక్యతతో వెలిగిపోతుందన్నారు. నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్వేతాశెట్టి సారథ్యంలో పార్టీ బలోపేతానికి, మహిళా అభ్యుదయానికి కృషిచేస్తామని చెప్పారు.