Breaking News

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

సారథి న్యూస్, కర్నూలు: మహిళ ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలుచేసిందని మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ మురళి అన్నారు. ఆదివారం నగరంలోని ముజాఫర్‌ నగర్‌లో వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిలోనూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చినమాట ప్రకారం వైఎస్సార్‌ ఆసరా నిధు సమకూర్చడం సంతోషించదగ్గ విషయమని, వనితలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్కాచెల్లెమ్మలకు ఆసరా, జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ సున్నా వడ్డీ రుణాలు, రక్షణ కోసం దిశ చట్టం…ఇలా మహిళకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందన్నారు. అనంతరం మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఎంసీ శాంతి, సీవో, టీఎల్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌, ఆర్‌పీలు పాల్గొన్నారు.