Breaking News

‘మహాసముద్రం’లో హీరోగా శర్వానంద్​

శర్వానంద్​ కొత్తసినిమా అజయ్​భూపతితో

ఆర్జీవీ శిష్యుడు, మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్​ ఇండస్ర్టీలో ప్రకంపనలు సృష్టించిన అజయ్​ భూపతి కొత్త చిత్రం మహాసముద్రంలో యువనటుడు శర్వానంద్​ హీరోగా చాన్స్​ కొట్టేశాడు. మహాసముద్రం స్ర్కిప్ట్​ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోతూ వస్తున్నది. తాజాగా శర్వానంద్​ ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కాగా హీరోయిన్​గా రాశీఖన్నా ఎంపికైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అజయ్​భూపతి మొదటి సినిమా ఆర్​ఎక్స్​ 100తో ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో నటించిన హీరో కార్తికేయ.. హీరోయిన్​ పాయల్​ రాజ్​పుత్​కు ఎంతో క్రేజ్​ వచ్చింది.