Breaking News

మహారాష్ట్రలో 2లక్షలు దాటిన కేసులు

షార్ట్ న్యూస్

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 6.875 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 2,30,599 కి చేరింది. తాజాగా 219 మందిని కరోనా పొట్టనపెట్టకోగా.. మొత్తం మరణాల సంఖ్య 9,667కు చేరింది. కాగా 1,27, 259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్​ థాక్రే వెల్లడించారు.