Breaking News

మల్లేశం​ను సత్కరించిన స్వేరోస్​

షార్ట్ న్యూస్

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సైకాలజిస్ట్స్​ అసోసియేషన్​ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జర్నలిస్ట్​ డాక్టర్​ ఎజ్రా మల్లేశంను స్వేరోస్​ గ్రూప్​ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వేరోస్​ సభ్యులు మాట్లాడుతూ.. మల్లేశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికకవాడం సంతోషంగా ఉన్నదని, కరోనా సమయంలో డాక్టర్‌ గా, పాత్రికేయుడుగా సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి తిరుపతి స్వేరో, జిల్లా జాయింట్ సెక్రటరీ గంగాధర్ స్వేరో, గ్రామ అధ్యక్షుడు ఈరెల్లి శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.