![షార్ట్ న్యూస్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/short-news-e1587967780849.jpg?fit=229%2C173&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జర్నలిస్ట్ డాక్టర్ ఎజ్రా మల్లేశంను స్వేరోస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వేరోస్ సభ్యులు మాట్లాడుతూ.. మల్లేశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికకవాడం సంతోషంగా ఉన్నదని, కరోనా సమయంలో డాక్టర్ గా, పాత్రికేయుడుగా సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి తిరుపతి స్వేరో, జిల్లా జాయింట్ సెక్రటరీ గంగాధర్ స్వేరో, గ్రామ అధ్యక్షుడు ఈరెల్లి శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.